నాడు వరల్డ్కప్ విన్నర్.. నేడు కూరగాయల వ్యాపారి..
భారత అంధుల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఓ క్రికెటర్పై కూడా కరోనా తన ప్రతాపం చూపించింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయి ఇప్పుడు కూరగాయల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు.
Blind Cricketer Naresh Tumda: మాయదారి కరోనా వైరస్ ప్రజల బ్రతుకులపై తీవ్రంగా దెబ్బకొట్టింది. పేదోడు నుంచి పెద్దోడు దాకా అందరి జీవితాలు ఈ వైరస్ దాటికి తలక్రిందులు అయ్యాయి. ఈ క్రమంలోనే భారత అంధుల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఓ క్రికెటర్పై కూడా కరోనా తన ప్రతాపం చూపించింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయి ఇప్పుడు కూరగాయల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు. ఓ ప్రముఖ జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం..
2018లో షార్జా వేదికగా జరిగిన అంధుల ప్రపంచకప్లో నరేష్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో పాకిస్తాన్పై జరిగిన పోరులో వీరోచిత ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. అప్పట్లో దేశం మొత్తం నరేష్ పేరు మారుమ్రోగింది. అయితే ఇప్పుడు అనుకోని అతిధిలా కరోనా వచ్చి అతడి జీవితాన్ని రోడ్డున పడేసింది. ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రస్తుతం కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో గల జమల్పూర్ మార్కెట్ పరిధిలో అతడు తన వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు.
Also Read:
ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!
Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
‘సీఎం కావడానికి కేటీఆర్కు అన్ని అర్హతలు ఉన్నాయి’..
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…
టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్