కరోనా వీరవిహారం: 24 గంటల్లో 6,767 కేసులు
దేశంలో కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటింది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి వైరస్ 147 మందిని బలి తీసుకుంది. కొత్తగా 6,767 మంది వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో కరోనా వివరాలు… దేశవ్యాప్తంగా కరోనా […]
దేశంలో కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటింది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి వైరస్ 147 మందిని బలి తీసుకుంది. కొత్తగా 6,767 మంది వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో కరోనా వివరాలు…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టీవ్ కేసులు: 73560
కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441
దేశం మొత్తం కరోనా మృతి చెందినవారి సంఖ్య : 3867
మరోవైపు మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47190కి చేరింది. సోమవారం నాటికి ఇది 50వేల మార్కుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే… 2608 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ కోవిడ్-19 కేసుల్లో భారత్ 11వ స్థానంలో ఉంది.