Corona Cases AP: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 203 పాజిటివ్ కేసులు నమోదు..
Corona Cases AP: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 44,679 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 203 పాజిటివ్ కేసులు
Corona Cases AP: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 44,679 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 203 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 231 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా.. కృష్ణలో ఒక్కరు మరణించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,85,437కు చేరింది. వీరిలో 8,75,921 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2382 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7134 మంది చనిపోయారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 23, చిత్తూరు 18, తూర్పుగోదావరి 27, గుంటూరు 41, కడప 9, కృష్ణా 30, కర్నూలు 5, నెల్లూరు 2, ప్రకాశం 2, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 22, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలో 2 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
#COVIDUpdates: 13/01/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,82,542 పాజిటివ్ కేసు లకు గాను *8,73,026 మంది డిశ్చార్జ్ కాగా *7,134 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,382#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/umYjwdwmLO
— ArogyaAndhra (@ArogyaAndhra) January 13, 2021