ప్రపంచవ్యాప్తంగా 65 లక్షలు దాటిన కరోనా పాటిజివ్ కేసులు

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా బుధవారం లక్షకి పైగా కొత్త కేసులు నమోదవ్వగా..

ప్రపంచవ్యాప్తంగా 65 లక్షలు దాటిన కరోనా పాటిజివ్ కేసులు
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 8:33 AM

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా బుధవారం లక్షకి పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 65,67,058కి చేరాయి. అలాగే నిన్న ఆరు వేల మందికి పైగా చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 387,899కి చేరింది. అలాగే ప్రస్తుతం 30,14,906 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 54201 పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.

ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. అమెరికాలో ఓ ఐదు రోజుల నుంచి కొత్త కేసులు, మరణాల నమోదు తగ్గుతోంది. అయితే నిన్న 20 వేలకి పైగా కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 19,01,783కి చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 109142కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. బుధవారం భారత్‌లో 8909 కరోనా కేసులు నమోదవ్వగా.. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,07,615కి చేరింది. అలాగే మొత్తం ఇప్పటివరకూ 5815 మంది మరణించారు. ప్రస్తుతం 101497 యాక్టీవ్ కేసులు ఉండగా, 100303 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.