అమెరికా, బ్రెజిల్, రష్యాతో పాటూ భారత్‌లోనూ అత్యంత తీవ్రంగా కరోనా..

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా సోమవారం 109898 కొత్త కేసులు నమోదవ్వగా.....

అమెరికా, బ్రెజిల్, రష్యాతో పాటూ భారత్‌లోనూ అత్యంత తీవ్రంగా కరోనా..
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2020 | 9:15 AM

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా సోమవారం 109898 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 64,73,094కి చేరాయి. అలాగే నిన్న 4516 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 381706కి చేరింది. అలాగే ప్రస్తుతం 3105374 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 54479 పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.

ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. అమెరికాలో ఓ ఐదు రోజుల నుంచి కొత్త కేసులు, మరణాల నమోదు తగ్గుతోంది. అయితే నిన్న తాజాగా 21203 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 18,80,526కి చేరాయి. అలాగే 1132 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 108057కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్‌లో 5,56,668 కోవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం మరణాల సంఖ్య 31278కి చేరింది. రష్యాలో మొత్తం కేసులు 423741 ఉండగా.. మరణాల సంఖ్య 5037గా ఉంది. ఇక స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత తగ్గుతూ, పెరుగుతూ ఉంది.

అలాగే భారత్ విషయానికి వస్తే.. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మంగళవారం భారత్‌లో 8171 కరోనా కేసులు నమోదవ్వగా.. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,98,706కి చేరింది. అలాగే మొత్తం ఇప్పటివరకూ 5394 మంది మరణించారు. ప్రస్తుతం 93,323 యాక్టీవ్ కేసులు ఉండగా, 91818 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.