భయంకరంగా కరోనా ఉధృతి.. ఏపీలో 351 కేసులు నమోదు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది. తాజాగా బుధవారం కొత్తగా 351 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 275 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 76 మంది...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది. తాజాగా బుధవారం కొత్తగా 351 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 275 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 76 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అలాగే బుధవారం ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కి చేరింది. అలాగే 2906 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 2559గా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో వైరస్తో చనిపోయిన వారి సంఖ్య 90కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులను నిర్వహిస్తోంది.
#COVIDUpdates: 17/06/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5555 పాజిటివ్ కేసు లకు గాను *2906 మంది డిశ్చార్జ్ కాగా *90 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2559#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/332lccs1HO
— ArogyaAndhra (@ArogyaAndhra) June 17, 2020
Read More:
బిగ్ బ్రేకింగ్: కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి..
బ్రేకింగ్: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..
షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్