పేదలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
ఏపీ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 26న 15,03,801 ఇళ్ల నిర్మాణ పనులను సర్కార్ స్టార్ట్ చెయ్యబోతుంది. ఈ పథకం కింద రానున్న నాలుగేళ్లలో 27 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో నిర్మించే 15 లక్షల ఇళ్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీటిని లబ్ధిదారే ఇల్లు నిర్మించే (బీఎల్సీ) పథకం కింద మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల్లో […]
ఏపీ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 26న 15,03,801 ఇళ్ల నిర్మాణ పనులను సర్కార్ స్టార్ట్ చెయ్యబోతుంది. ఈ పథకం కింద రానున్న నాలుగేళ్లలో 27 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో నిర్మించే 15 లక్షల ఇళ్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీటిని లబ్ధిదారే ఇల్లు నిర్మించే (బీఎల్సీ) పథకం కింద మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థ(యూడీఏ)ల్లో కడతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారాన్ని అందిస్తాయి. ఒక్కో ఇంటికి కేంద్రం సాయంగా రూ.లక్షన్నర అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమిచ్చే రాయితీపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇటీవల సీఎం ఉచితంగా స్థలమిచ్చి.. ఇల్లు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు సౌకర్యాలను పరిశీలించి స్థలాలను ఎంపిక చేస్తారు. ఇళ్ల నిర్మాణానికి విద్యుత్, నీటి సౌకర్యం అందుబాటులో ఉండి..న్యాయపరయైన ఇబ్బందులు లేని స్థలాలను మొదటి విడత ఇళ్ల నిర్మాణాలకు ఎంపిక చేశారు. ఒక్కో ప్రాంతంలో 10 నుంచి 10 వేల వరకు ఇళ్లు నిర్మించనున్నారు.