అనంతపురం జిల్లాలో పోలీస్ దొంగ
అనంతపురం జిల్లాలో ఓ విచిత్ర పోలీస్ దొంగను గుర్తించారు పోలీసులు. గుత్తి జి.ఆర్.పి పోలీస్ స్టేషన్ లో ప్రింటర్, స్కానర్, ఖైదీలకు వేసే సంకెళ్లను మంజునాథ్ అనే కానిస్టేబుల్ దొంగిలించాడు.
అనంతపురం జిల్లాలో ఓ విచిత్ర పోలీస్ దొంగను గుర్తించారు పోలీసులు. గుత్తి జి.ఆర్.పి పోలీస్ స్టేషన్ లో ప్రింటర్, స్కానర్, ఖైదీలకు వేసే సంకెళ్లను మంజునాథ్ అనే కానిస్టేబుల్ దొంగిలించాడు. స్టేషన్ నుంచి ఎత్తుకెళ్లిన సంకెళ్లను భార్యకు వేసి ఇంట్లో చిత్రహింసలు గురిచేశాడు. భార్య ఫిర్యాదుతో ఆదోని పోలీసులు కేసు నమోదు చేశాడు. దీంతో పోలీస్ స్టేషన్ నుండి మంజునాథ్ పరారయ్యాడు. మంజునాథ్ ఇంట్లో తనిఖీ చేయగా 12 శాఖలకు చెందిన నకిలీ సీల్ లు బయటపడ్డాయి. గుత్తి పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్, ప్రాపర్టీ, సంకెళ్లు దొంగతనం చేసినందుకు గాను 379, 409, 406 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు జి.ఆర్.పి అధికారులు.
Also Read :
ఏపీ : టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులకు గ్రేడులు కేటాయిస్తూ ఉత్తర్వులు
కేబీఆర్ పార్క్ మూసివేత : హైకోర్టు నోటీసులు
Dhoni In IPL : స్టేడియం బయటకు బంతి : ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్