మావోల ఘాతుకం.. కానిస్టేబుల్ను కొట్టి చంపి.. అతడి తల్లిదండ్రులపై..
ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఇంటిపై దాడి చేసి హతమార్చారు. బుధవారం రాత్రి సదరు కానిస్టేబుల్ ఇంటిపై మావోయిస్టులు దాడికి..
ఛత్తీస్ఘడ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఇంటిపై దాడి చేసి హతమార్చారు. బుధవారం రాత్రి సదరు కానిస్టేబుల్ ఇంటిపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. జాంగ్లా ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న కానిస్టేబుల్ను బయటకు లాగి కొట్టి చంపేశారు. అంతేకాదు.. అతడి తల్లిదండ్రులను కూడా గాయపర్చారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కష్యప్ తెలిపారు.
మరోవైపు దంతెవాడ జిల్లాలో పద్దెనిమిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరు అనేక ఘటనల్లో నిందితులుగా ఉన్నారు. కొందరి తలలపై లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది. దీంతో పోలీసులు ఆ రివార్డు సోమ్మును వారికి ఇచ్చి.. ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
One Assistant Constable lost his life and his parents got injured, after naxals attacked the personnel at his residence in Jangla area last night: Kamalochan Kashyap, Superintendent of Police, Bijapur. #Chhattisgarh
— ANI (@ANI) July 2, 2020