చంపేశారు సరే… గ్యాంగ్‌స్టర్ వెనక ఉన్నది ఎవరు…? ప్రియాంక ప్రశ్నలు

Priyanka Gandhi On Vikas Dubey’s Death : నిందితుడు వికాస్ దుబే ఎన్ కౌంటర్ లో చంపేశారు సరే.. మరి అతడి నేర సామ్రాజ్యం వెనక ఉన్నవారి సంగతి ఏంటి అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే హతమైన వెంటనే ప్రియాంక తన ట్విట్టర్‌ లో వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో పలు ప్రశ్నలు వేశారు. “పిల్లలపై, దళితులు, మహిళలపై జరుగుతున్న […]

చంపేశారు సరే... గ్యాంగ్‌స్టర్ వెనక ఉన్నది ఎవరు...? ప్రియాంక ప్రశ్నలు
Follow us

|

Updated on: Jul 10, 2020 | 4:54 PM

Priyanka Gandhi On Vikas Dubey’s Death : నిందితుడు వికాస్ దుబే ఎన్ కౌంటర్ లో చంపేశారు సరే.. మరి అతడి నేర సామ్రాజ్యం వెనక ఉన్నవారి సంగతి ఏంటి అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే హతమైన వెంటనే ప్రియాంక తన ట్విట్టర్‌ లో వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో పలు ప్రశ్నలు వేశారు.

“పిల్లలపై, దళితులు, మహిళలపై జరుగుతున్న దాడుల్లో యూపీ నెంబర్ 1గా ఉంది. మారణాయుధాలు, హత్యల్లో యూపీ నెంబర్ 1గా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితి పూర్తిగా చెత్తగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో వికాస్ దూబే వంటి నేరగాళ్ల సామ్రాజ్యం నడుస్తోంది. మొత్తం దేశానికి తెలుసు వికాస్ దూబేకు రక్షణ కల్పించింది రాజకీయ నేతలేనని. వికాస్ దూబే వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి” అని తన ట్విట్టర్‌లో ప్రియాంక డిమాండ్ చేశారు.