కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ.. ఏమన్నారంటే..?
కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పుణేలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలను పట్టించుకునే అంశాన్నే మరిచిపోయి.. పూర్తిగా స్పృహలోనే లేకుండా పోయిందన్నారు. అంతేకాదు ఆ పార్టీకి కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినా అది ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనన్నారు. ఇక అటు బీజేపీ పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో […]
కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పుణేలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలను పట్టించుకునే అంశాన్నే మరిచిపోయి.. పూర్తిగా స్పృహలోనే లేకుండా పోయిందన్నారు. అంతేకాదు ఆ పార్టీకి కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినా అది ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనన్నారు. ఇక అటు బీజేపీ పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మతం మారాలనుకునే వారు నెలముందు జిల్లా కలెక్టరుకు నోటీసు ఇవ్వాలనే చట్టాన్ని హిమాచల్లో బీజేపీ తీసుకొచ్చిందన్నారు. అదే చట్టాన్ని ప్రధాని మోదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టినా ఆశ్చర్యం లేదన్నారు.