రేపే ‘ మహా ‘ ఎపిసోడ్ ఫైనల్ ! సోనియా నిర్ణయంపై ఉత్కంఠ

మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు ఇంకా తర్జనభర్జనలు పడుతున్నాయి. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ.. సిడబ్ల్యుసి గురువారం ఉదయం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమైంది. సేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి మరింత ‘ పటిష్టం ‘ గా కలవాలంటే ఇంకా కొన్ని ‘ చిక్కులు ‘ ఉన్నాయని ఈ పార్టీ (కాంగ్రెస్) వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. బహుశా శుక్రవారం తాము తుది నిర్ణయం తీసుకోవచ్ఛునని పార్టీ సీనియర్ నేత […]

రేపే ' మహా ' ఎపిసోడ్ ఫైనల్ ! సోనియా నిర్ణయంపై ఉత్కంఠ
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 1:00 PM

మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు ఇంకా తర్జనభర్జనలు పడుతున్నాయి. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ.. సిడబ్ల్యుసి గురువారం ఉదయం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమైంది. సేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి మరింత ‘ పటిష్టం ‘ గా కలవాలంటే ఇంకా కొన్ని ‘ చిక్కులు ‘ ఉన్నాయని ఈ పార్టీ (కాంగ్రెస్) వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. బహుశా శుక్రవారం తాము తుది నిర్ణయం తీసుకోవచ్ఛునని పార్టీ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ తెలిపారు. ఏ విధమైన అభ్యంతరాలున్నా ‘ మహాకూటమి ‘ పై ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని సోనియాకు సీనియర్ నాయకులు సలహా ఇఛ్చినట్టు తెలుస్తోంది. మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఎదుర్కోవాలంటే.. ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చూడాలంటే ‘ గట్టి నిర్ణయం ‘ తీసుకోక తప్పదని ఈ నేతలు భావిస్తున్నారు. ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో బుధవారం సమావేశమైన కాంగ్రెస్ నాయకులు తమపార్టీకి, సేనకు సంబంధించి మరికొన్ని అంశాలను పరిష్కరించవలసి ఉందని అభిప్రాయపడ్డారు. సేన-ఎన్సీపీ, కాంగ్రెస్ లేనిదే రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడబోదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చించాయని, అయితే అధికార పంపిణీ ప్రస్తావన ఈ చర్చల్లో రాలేదని తెలుస్తోంది. అటు-ప్రధాని మోదీతో ఎన్సీపీ నేత శరద్ పవార్ సమావేశమైన అనంతరం.. కాంగ్రెస్ నాయకులు ఈ తాజా పరిణామంపై ఆ పార్టీతో మంతనాలు జరిపారు. అప్పుడే ఈ భేటీపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించింది. మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభంపై తాను ప్రధానితో చర్చించానని పవార్ చెబుతున్నారు. అయితే ఆయనకు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఇవ్వజూపుతున్నదనే కొత్త వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. ఎన్సీపీ తోడ్పాటుతో బీజేపీ.. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు యత్నిస్తోందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. సేనతో పోలిస్తే ఎన్సీపీకి కేవలం రెండు మూడు స్థానాలు తక్కువగా ఉన్నాయి. ఇది కమలం పార్టీకి అవసరమైన మెజారిటీకి దోహదపడవచ్ఛునని భావిస్తున్నారు. ఈ వార్తలు కూడా కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. అయితే సేన నేత సంజయ్ రౌత్ మాత్రం.. అన్ని అవరోధాలూ పరిష్కారమయ్యాయని, రెండునుంచి అయిదు రోజుల్లోగా రాష్ట్రంలో సేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమాగా చెబుతున్నారు.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు