పాకిస్తాన్‌లో ‘షాట్ గన్’ ! పెళ్ళికి వెళ్లి ప్రెసిడెంట్‌తో భేటీ

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన శత్రుఘ్న సిన్హా.. శనివారం పాకిస్తాన్ సందర్శించారు. లాహోర్ లో ఆయన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ని కలిసి.. భారత, పాకిస్తాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై చర్చించారు.

పాకిస్తాన్‌లో 'షాట్ గన్' ! పెళ్ళికి వెళ్లి ప్రెసిడెంట్‌తో భేటీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 11:08 AM

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన శత్రుఘ్న సిన్హా.. శనివారం పాకిస్తాన్ సందర్శించారు. లాహోర్‌లో ఆయన పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ని కలిసి.. భారత, పాకిస్తాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై చర్చించారు. ఉభయ దేశాల మధ్య శాంతి నెలకొనాల్సిన అవసరం ఉండేది ఇద్దరూ అభిప్రాయపడ్డారు. గవర్నర్ హౌస్ లో జరిగిన వీరి భేటీలో.. కాశ్మీర్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. భారత ప్రభుత్వం కాశ్మీర్లో ఆంక్షలు విధించడంపైనా, పలువురు రాజకీయనాయకులను నిర్బంధించడంపైనా ఆరిఫ్ అల్వీ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా-పాక్ బిజినెస్ మన్, ఫిల్మ్ మేకర్ అసద్ అహ్ సాన్ ఆహ్వానంపై ఓ వివాహానికి హాజరయ్యేందుకు శత్రుఘ్న సిన్హా ఆ దేశాన్ని సందర్శించారు. ఇది పూర్తిగా తన పర్సనల్ టూర్ అని, రాజకీయపరమైనది కాదని సిన్హా ట్వీట్ చేశారు.