#ghmc : ఎందుకంత ఆగమాగం అవుతున్నారు…సర్జికల్ స్ట్రైక్ అంశంపై మరో డైనమైట్ పేల్చిన రాములమ్మ…
గ్రేటర్ పోరు డైలాగ్ వార్ నడుస్తోంది. సర్జికల్ స్ట్రైక్ .. డైనమైట్లు పేలుతున్నాయి.. తాజాగా.. సర్జికల్ స్ట్రైక్ అంశం చుట్టూ నిన్నటి నుంచి పేలుతున్న డైలాగ్ల డైనమైట్లలో... రాములమ్మ కూడా మరో డైనమైట్ పేల్చారు. రేపో మాపో ఆమె కాషాయ..
Vijaya Shanti Comments : గ్రేటర్ పోరు డైలాగ్ వార్ నడుస్తోంది. సర్జికల్ స్ట్రైక్ .. డైనమైట్లు పేలుతున్నాయి.. తాజాగా.. సర్జికల్ స్ట్రైక్ అంశం చుట్టూ నిన్నటి నుంచి పేలుతున్న డైలాగ్ల డైనమైట్లలో… రాములమ్మ కూడా మరో డైనమైట్ పేల్చారు. రేపో మాపో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చేలా ఆమె కామెంట్లు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకంత ఆగమాగం అవుతున్నాయని ట్విట్టర్లో ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి.
ఎవరినైనా దాచిపెట్టడం వల్లే టీఆర్ఎస్ భయాందోళనలకు గురవుతోందని ప్రజలు అభిప్రాయపడే అవకాశం ఉందని కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసిందని, పాతబస్తీలో ఎవరూ లేరని ముఖ్యమంత్రి , తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అధికారిక నివేదిక ఇవ్వొచ్చు కదా అని సెటైర్లు వేశారు విజయశాంతి.
సర్జికల్ స్ట్రయిక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆరెస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి?
— VijayashanthiOfficial (@vijayashanthi_m) November 25, 2020
లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే భయాందోళనలకు టీఆరెస్ గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముంది.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) November 25, 2020