‘ఇదేం పాలసీ’? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఫైర్
యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పాటిస్తున్న 'నో టెస్ట్..నో కరోనా వైరస్'.. పాలసీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. ఈ విధానం దారుణ పరిస్థితికి దారి తీస్తుందని హెచ్చరించారు. కోవిడ్-19 క్రైసిస్ ని..
యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పాటిస్తున్న ‘నో టెస్ట్..నో కరోనా వైరస్’.. పాలసీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. ఈ విధానం దారుణ పరిస్థితికి దారి తీస్తుందని హెచ్చరించారు. కోవిడ్-19 క్రైసిస్ ని మీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోతోందని యోగికి రాసిన లేఖలో ఆమె ఆరోపించారు. మేనేజింగ్ పబ్లిసిటీ వల్లో, ఈ విధమైన నినాదాల వల్లో ఈ పాండమిక్ ని నివారించలేమని, చిత్తశుద్ది ఉండాలని ఆమె పేర్కొన్నారు. యూపీలో ఒక్క శుక్రవారం రోజే రెండున్నర వేల కరొనా కేసులు నమోదయ్యాయని, 50 మంది కరోనా రోగులు మరణించారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. మీ రాష్ట్రంలోని గ్రామాల్లో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తోందని, ఇక క్వారంటైన్ సెంటర్లలోని అధ్వాన్న పరిస్థితి గురించి చెప్పలేమన్నారు. ఆ కేంద్రాల్లో మిస్ మేనేజ్మెంట్ కారణంగా టెస్టింగులు చేయించుకోవడానికి జనం తమ ఇళ్ళు వదిలి బయటకు రావడం లేదని ఆమె అన్నారు. మీ పాలసీ టెస్టింగుల సంఖ్యను మరీ తక్కువ చేస్తోంది అని ఆమె ఆరోపించారు.