సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదు

మధ్యప్రదేశ్ : భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదైంది. ముంబై మాజీ ఏటీసీ చీఫ్‌ హేమంత్ కర్కరేపై సాధ్వీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుడు దేవేంద్ర సింగ్‌ యాదవ్‌ ఇండోర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాదవ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సాధ్వీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం కూడా సీరియస్ […]

సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 7:51 PM

మధ్యప్రదేశ్ : భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై కేసు నమోదైంది. ముంబై మాజీ ఏటీసీ చీఫ్‌ హేమంత్ కర్కరేపై సాధ్వీ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుడు దేవేంద్ర సింగ్‌ యాదవ్‌ ఇండోర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాదవ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు సాధ్వీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకుంది. కర్కరేపై వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై బదులు ఇవ్వాలంటూ జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమెకు నోటీసులు పంపారు.