ఈ నెల 17న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలోని పదిహేడు స్థానాలకు విడతల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటరీకి సంబంధించిన పార్టీ సమీక్షా సమావేశాలను గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో నిర్వహిస్తున్నట్లు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, ఏఐసీసీ […]
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలోని పదిహేడు స్థానాలకు విడతల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటరీకి సంబంధించిన పార్టీ సమీక్షా సమావేశాలను గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో నిర్వహిస్తున్నట్లు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీమ్ అహ్మద్, శ్రీనివాసన్ తదితరులు హాజరుకానున్నారు.