పుర పోరు : టీఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్‌ అభ్యర్థి..

చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణ మునిసిపల్ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా బోధన‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నాయకులు కూడా బాహాబాహికి దిగారు. 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇమ్రాన్‌ ఆందోళనకు దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన  కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్.. ఇమ్రాన్ ముక్కును కొరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇలియాస్‌ను […]

పుర పోరు : టీఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్‌ అభ్యర్థి..
Follow us

|

Updated on: Jan 22, 2020 | 8:18 PM

చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణ మునిసిపల్ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా బోధన‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నాయకులు కూడా బాహాబాహికి దిగారు. 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇమ్రాన్‌ ఆందోళనకు దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన  కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్.. ఇమ్రాన్ ముక్కును కొరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇలియాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.