ఈ నెల 12న సీడబ్ల్యూసీ సమావేశం
గాంధీనగర్ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) ఈ నెల 12న గాంధీనగర్లో జరగనుంది. 1930 మార్చి 12న జాతిపిత మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి చేపట్టిన దండియాత్రకు గుర్తుగా అదే రోజు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ అమిత్ చావ్డా తెలిపారు. 1961 తర్వాత గుజరాత్లో సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. సమావేశం అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ […]
గాంధీనగర్ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ) ఈ నెల 12న గాంధీనగర్లో జరగనుంది. 1930 మార్చి 12న జాతిపిత మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి చేపట్టిన దండియాత్రకు గుర్తుగా అదే రోజు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ అమిత్ చావ్డా తెలిపారు. 1961 తర్వాత గుజరాత్లో సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. సమావేశం అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత సీఎంలు పాల్గొంటారని హస్తం నేతలు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. వాస్తవానికి సీడబ్ల్యూసీ సమావేశం గత నెల 28నే జరగాల్సి ఉంది. భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేశారు.