‘బిగ్‌బాస్‌ 4’లో ‘కమిట్‌మెంట్’‌ భామ..!

తెలుగులో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

'బిగ్‌బాస్‌ 4'లో 'కమిట్‌మెంట్'‌ భామ..!
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 6:23 PM

తెలుగులో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ను త్వరలో ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అన్నీ కుదిరితే ఆగష్టులో ఈ సీజన్‌ను ప్రారంభించాలనుకుంటున్న నిర్వాహకులు.. దీనికి హోస్ట్‌గా నాగార్జునను ఫైనల్ చేసినట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సారి బిగ్‌బాస్‌లో ఎవరు పాల్గొనబోతున్నారన్న చర్చ గత కొద్ది రోజులుగా ఫిలింనగర్‌ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా.. ఆ క్రేజ్‌ను అలానే కొనసాగించేందుకు ఈ సీజన్‌లో పలువురు సెలబ్రిటీలను భాగం చేయాలని నిర్వాహకులు అనుకుంటున్నారట.

.ఈ నేపథ్యంలో ఇప్పటికే హీరో తరుణ్‌, సింగర్ కమ్‌ యాంకర్ మంగ్లీ, యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్‌, సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్‌, హంసా నందిని, శ్రద్దా దాస్‌, యామిని భాస్కర్‌, ప్రియా వడ్లమని పేర్లు వినిపించగా.. తాజాగా హుషారు, కమిట్‌మెంట్‌ బ్యూటీ రమ్య పసుపులేటి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరి ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు..? కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు..? ఎన్ని రోజులు షో ఉండనుంది..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.