కచ్ తీరంలో డ్రగ్స్ కలకలం..
గుజరాత్లోని కచ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఇండియన్ కోస్టల్ గార్డ్ టీం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. పెద్ద ఎత్తున చరస్ ప్యాకెట్లను గుర్తించారు. జకౌ తీర ప్రాంతంలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. పెట్రోలింగ్ చేస్తున్న..
గుజరాత్లోని కచ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఇండియన్ కోస్టల్ గార్డ్ టీం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. పెద్ద ఎత్తున చరస్ ప్యాకెట్లను గుర్తించారు. జకౌ తీర ప్రాంతంలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. పెట్రోలింగ్ చేస్తున్న కోస్టల్ గార్డ్స్ 28 చరస్ ప్యాకెట్లు ఉన్న ఓ సంచిని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చరస్ ప్యాకెట్ ఒక కిలో బరువు ఉందని అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.42 లక్షలు ఉంటుందని ఇండియన్ కోస్టల్ గార్డ్ అధికారులు తెలిపారు. వీటిని మెరైన్ పోలీసులకు అందజేశామని.. అధికారులు తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా కచ్ తీరంలోని పలు చిన్నచిన్న దీవుల్లో డ్రగ్స్ ముఠా సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే గత నెలలో కూడా పలు నిషేధిత డ్రగ్స్ పదార్ధాలను తీర ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు.
Coast Guard patrol team recovered 28 ‘charas’ packets of 1 kg each amounting to Rs 42 lakhs near Jakhau coast yesterday. Packets handed over to Marine Police for legal formalities: Indian Coast Guard #Gujarat pic.twitter.com/RFff0o5GX7
— ANI (@ANI) July 20, 2020