గుజరాత్ తీర ప్రాంతంలో డ్రగ్స్ కలకలం
గుజరాత్ తీర ప్రాంతంలో డ్రగ్స్ ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా కచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చరస్ (డ్రగ్స్లోని ఓ రకం) ప్యాకెట్లు విపరీతంగా దొరుకుతున్నాయి. ఓ విభాగం నుంచి పక్కా..
గుజరాత్ తీర ప్రాంతంలో డ్రగ్స్ ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా కచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చరస్ (డ్రగ్స్లోని ఓ రకం) ప్యాకెట్లు విపరీతంగా దొరుకుతున్నాయి. ఓ విభాగం నుంచి పక్కా సమాచారం అందడంతో.. తీర ప్రాతంలో పోలీసులు, కోస్ట్ గార్డులు పెట్రోలింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు కచ్ తీర ప్రాంతంలో 24 చరస్ ప్యాకెట్లను కోస్ట్గార్డ్స్ గుర్తించారు. మార్కెట్లో వీటి విలువ రూ.36 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. కచ్ ప్రాంతంలోని జఖౌ పోర్ట్ సమీపంలోని కడియారి ద్వీప ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసిందని డిఫెన్స్ వింగ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలావుంటే.. మే 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 88 చరస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కోస్టల్ ఏరియా అధికారులు వెల్లడించారు. వీటి విలువ రూ.1.32 కోట్లు ఉంటుందన్నారు. అయితే ఈ ప్యాకెట్లు పట్టుబడ్డ ప్రాంతంలో డ్రగ్ స్మగ్లర్లు సంచరిస్తున్నారని.. ఇది జనావాసాలు లేని ప్రాంతమని తెలిపారు. వీటిని సప్లే చేసే ముఠా కోసం గాలింపు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
Landing party of Indian Coast Guard recovered 24 packets of ‘Charas’ worth approx Rs 36 lakh, yesterday during coastal patrol near Jakhau port in Gujarat. Since May 20, ICG in coordination with other govt enforcement agencies recovered over 1200 packets of ‘Charas’: Govt of India pic.twitter.com/TsHjg6tY5W
— ANI (@ANI) July 4, 2020