సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు

ఏపీ సీఎం కడప జిల్లా పర్యటన ఖరారైంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు.

సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 6:53 PM

ఏపీ సీఎం కడప జిల్లా పర్యటన ఖరారైంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. హరికిరణ్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులు, ఎస్పీ అన్బురాజన్‌తో సమీక్షా సమావేశం నిర్వహించిన హరికిరణ్.. భద్రత విషయంలో ఎలాంటి లోటు జరగకూడదని సూచించారు. ఇక కరోనా నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌(ఎస్‌ఓపీ) తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. పర్యటనలో భాగంగా ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో సీఎం జగన్‌ నిర్వహించే కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. బందోబస్తు పరంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్బురాజన్‌కు కలెక్టర్ తెలిపారు.