ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెవెన్యూశాఖపై నిర్వహిస్తున్న సమీక్ష ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం అర్బన్ హౌసింగ్, టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) పై సీఎం సమీక్ష ప్రారంభమైంది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ రివ్యూలో భాగమైంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ మిథున్రెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. టిడ్కోలో రివర్స్ టెండరింగ్ అంశం చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
Breaking News
- సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్ నిలువబోతోంది. గజ్వేల్లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు-హరీష్రావు.
- ఇంటర్ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్ ప్రెస్మీట్. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్చేసుకోవచ్చ -ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్
- రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
- తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
- విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్ దాడులు ఈ-టికెట్లు బ్లాక్ చేస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్. కటక్కు చెందిన సమీర్కుమార్ ప్రధాన్, దుర్గారావు అరెస్ట్. ఐఆర్సీటీసీ వెబ్సైట్ను హ్యాక్ చేస్తున్న నిందితులు ల్యాప్టాప్, డాక్యుమెంట్లు సీజ్చేసిన ఆర్పీఎఫ్
- కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
- వరంగల్: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్ బోల్తా. రాంపూర్కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.