“నాలో.. నాతో.. వైఎస్సార్” పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజమమ్మ రాసిన "నాలో.. నాతో.. వైఎస్సార్" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలో ఆవిష్కరించారు. అంతకుముందు...
CM YS Jagan launched Nalo Natho YSR Book : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజమమ్మ రాసిన “నాలో.. నాతో.. వైఎస్సార్” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలో ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం మాట్లాడారు… బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం… అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో నాన్న చూసిన విధానాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారని అన్నారు. ఇది ఒక మంచి పుస్తకం అని సీఎం జగన్ పేర్కొన్నారు.