తమిళనాట మళ్లీ తెరుచుకున్న అమ్మ క్యాంటీన్లు
తమిళనాడులో పేదవారికి అన్నం పెట్టే అమ్మ క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి.
తమిళనాడులో పేదవారికి అన్నం పెట్టే అమ్మ క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో బుధవారం మొబైల్ అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో అమ్మ క్యాంటీన్ల వాహనాలను పచ్చజెండా ఊపి సీఎం పళనిస్వామి ప్రారంభించారు. అనంతరం అమ్మ క్యాంటీన్లోనే పళనిస్వామితో సహా పలువురు మంత్రులు నేతలు భోజనం చేశారు. ఈ మొబైల్ క్యాంటీన్లను భవన నిర్మాణ పనులు జరిగే చోట, కార్మికులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నారు. పేదవాళ్లు ఆకలి ఇబ్బందిపడకుండా ఉండేందుకే ఈ అమ్మ క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిరోజు అందరికీ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తామన్నారు.