సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్..
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. భారత్ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం స్వయంగా పరామర్శించి,
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. భారత్ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం స్వయంగా పరామర్శించి, ప్రభుత్వ సాయాన్ని అందజేయనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంతోష్బాబుబాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతోపాటు ఇంటి స్థలం, సంతోష్బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి సాయం అందజేస్తానన్నారు. అన్నట్లుగానే సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు కేసీఆర్. సీఎం రాక సందర్బంగా కరోనా వైరస్ కారణంగా వైద్యాధికారుల సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.