గవర్నర్ తమిళిసైతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కొత్త సచివాలయ నిర్మాణంపై గవర్నర్తో సీఎం చర్చించనున్నారు. ఈ మేరకు..
తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, కొత్త సచివాలయ నిర్మాణంపై గవర్నర్తో సీఎం చర్చించనున్నారు. ఈ మేరకు మరికాసేపట్లో రాజ్భవన్ వెళ్లనున్న సీఎం కేసీఆర్ గవర్నర్తో ఇంకా పలు కీలక విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం.
సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణానికి సంబంధించి కొత్త డిజైన్పై సీఎం కేసీఆర్ గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది. రోడ్లు భవనాలశాఖ సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ముఖ్యకార్యదర్శి, ఇంజినీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది. సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.