వాటికి ఆ రంగు మార్చండి.. సీఎం కేసీఆర్ ఆదేశం

ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సుల రంగును వెంటనే మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని..

వాటికి ఆ రంగు మార్చండి.. సీఎం కేసీఆర్ ఆదేశం
Follow us

|

Updated on: Jul 23, 2020 | 11:55 PM

ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సుల రంగును వెంటనే మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కు సూచించారు. రవాణా శాఖ మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్‌ బస్సులు గులాబీ రంగులో ఉండకుండా చూడాలన్నారు. సీఎం ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వాటికి ఉన్న గులాబీ రంగును మార్చేపనిలో పడ్డారు.

ఖమ్మంలోని ఎస్సార్‌-బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను బుధవారం అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బస్సులను మంత్రి అజయ్‌ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఆర్టీసీలో పనికి రాకుండా మూలన పడి ఉన్న బస్సులను ఈ విధంగా ఉపయోగంలోకి తీసుకు వచ్చారు ఆర్టీసీ అధికారులు.