Breaking News : ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్లైన్ చేయాలి
15 రోజుల్లోగా ఆన్లైన్లో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్మెంట్ల వివరాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదుకాని ఇళ్లు, ఇళ్ల స్థలాలు,
15 రోజుల్లోగా ఆన్లైన్లో ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్మెంట్ల వివరాలు నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదుకాని ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే ఆస్తుల వివరాలన్నీ వందశాతం ఆన్లైన్ చేయాలని స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ సమీక్షలో పాల్గొన్నారు.