భారీగా పెరిగిన మాంసం ధరలు…
“గుడ్లు, చికెన్, చేపలు తింటే ఇమ్యూనిటి పవర్ పెరుగుతోంది. కరోనానిఎదుర్కోవడంలో మాంసం కూడా సహరిస్తోంది. కొంతమంది దుర్మార్గులు దీనిపై దుష్ప్రచారం చేశారు”..ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ఇవి. సీఎం ఒక్క మాట చెప్పగానే మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో కొన్ని చోట్ల కోళ్లను ఫ్రీగా ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనం క్యూలలో నిలబడి మరీ మాంసం కొనుగోలు చేస్తున్నారు. ఫౌల్ట్రీ యజమానులు కన్నీళ్లకు సీఎం కేసీఆర్ […]
“గుడ్లు, చికెన్, చేపలు తింటే ఇమ్యూనిటి పవర్ పెరుగుతోంది. కరోనానిఎదుర్కోవడంలో మాంసం కూడా సహరిస్తోంది. కొంతమంది దుర్మార్గులు దీనిపై దుష్ప్రచారం చేశారు”..ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ఇవి. సీఎం ఒక్క మాట చెప్పగానే మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో కొన్ని చోట్ల కోళ్లను ఫ్రీగా ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనం క్యూలలో నిలబడి మరీ మాంసం కొనుగోలు చేస్తున్నారు. ఫౌల్ట్రీ యజమానులు కన్నీళ్లకు సీఎం కేసీఆర్ మాటలు అడ్డుకట్ట వేశాయనే చెప్పాలి.
ఉగాది నుంచి మాంసం రేట్లు భారీగా పెరిగాయి. వ్యాపారులు కూడా గత నష్టాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో కిలో చికెన్ ను రూ.200కి పెంచారు. మటన్ కూడా రూ.700 నుంచి రూ.800 మధ్య అమ్ముతున్నారు. చేపల ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్లా ఇంచుమించు ఇవే ధరలు ఉన్నాయి. ఈ క్రమంలో మాంసం షాపుల యజమానులకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక ధరలకు అధిక ధరలకు అమ్ముతోన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.