ఏపీలో పదవుల పందేరం.. ఐటీకి ముగ్గురు అధికారులు..!
ఏపీలో సీఎం జగన్ చకచకా పావులు కదుపుతున్నారు. పలు కీలకమైన పదవులను ప్రవేశపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో ముగ్గురికి ఆయన కీలక పదవులు కేటాయించారు. రాష్ట్రంలోని ఐటీ విభాగాన్ని.. బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేపడుతోంది. ఇందులో భాగంగా ఐటీ సలహాదారునిగా ముగ్గురిని నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ సాంకేతిక సలహాదారులుగా జీ విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ దేవి రెడ్డి, ఐటీ పెట్టుబడులు, పాలసీ సలహాదారునిగా కే రాజశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ఐటీ […]
ఏపీలో సీఎం జగన్ చకచకా పావులు కదుపుతున్నారు. పలు కీలకమైన పదవులను ప్రవేశపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో ముగ్గురికి ఆయన కీలక పదవులు కేటాయించారు. రాష్ట్రంలోని ఐటీ విభాగాన్ని.. బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేపడుతోంది. ఇందులో భాగంగా ఐటీ సలహాదారునిగా ముగ్గురిని నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ సాంకేతిక సలహాదారులుగా జీ విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ దేవి రెడ్డి, ఐటీ పెట్టుబడులు, పాలసీ సలహాదారునిగా కే రాజశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.