మంగళగిరికి సీఎం జగన్ అదిరిపోయే వరాలు..అవేంటో తెల్సా?

రాష్ట్రంలో నగరాలు, మున్సిపాల్టీలలో సదుపాయాల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వార్డు సచివాలయ వ్యవస్థను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశించారు. గుంటూరు జిల్లాలో తాను నివాసం ఉంటున్న మంగళగిరి నియోజక వర్గంపై వరాల జల్లు కురిపించారు. కాగా మున్సిపల్, అర్బన్ డవ్‌లప్‌మెంట్ అధికారలతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1. తాడేపల్లి, మంగళగిరిలను ఆదర్శ మున్సిపాల్టీలుగా తయారు చేయాలని ఆదేశం 2. తాడేపల్లి, […]

మంగళగిరికి సీఎం జగన్ అదిరిపోయే వరాలు..అవేంటో తెల్సా?
Follow us

|

Updated on: Sep 27, 2019 | 9:20 PM

రాష్ట్రంలో నగరాలు, మున్సిపాల్టీలలో సదుపాయాల కల్పనపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వార్డు సచివాలయ వ్యవస్థను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశించారు. గుంటూరు జిల్లాలో తాను నివాసం ఉంటున్న మంగళగిరి నియోజక వర్గంపై వరాల జల్లు కురిపించారు. కాగా మున్సిపల్, అర్బన్ డవ్‌లప్‌మెంట్ అధికారలతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

1. తాడేపల్లి, మంగళగిరిలను ఆదర్శ మున్సిపాల్టీలుగా తయారు చేయాలని ఆదేశం

2. తాడేపల్లి, మంగళగిరిలో ఇళ్లులేని వారందరికీ ఇళ్లు కేటాయించాలని నిర్ణయం

3. తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలని అధికారులకు సూచిన

4. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని టార్గెట్

5. తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం

కృష్ణానది కట్టమీద, లోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ స్పెషల్ ఇంట్రస్ట్ తీసుకున్నారు. వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అన్నారు. ఇళ్ల నిర్మాణం కింద ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో కోరుకున్న చోట వీరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లతో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలం ఇళ్లుకట్టి ఉంటున్నవారికి పట్టాలు మంజూరుచేయాలన్నారు.