టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు

ఎలక్షన్ మిషన్ -2019పై బూత్ కన్వీనర్లు, సేవామిత్రులు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి ఇంకా 9 రోజులే గడువుందని.. అందరూ అవిశ్రాంతంగా పనిచేయాలని తన పార్టీ నేతలకు సూచించారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో.. బూత్ కన్వీనర్ కూడా అంతే ముఖ్యమని.. అందరూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి విస్త‌ృతంగా తీసుకెళ్లాలని అన్నారు. అలాగే.. మన పార్టీపై […]

టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Apr 01, 2019 | 1:23 PM

ఎలక్షన్ మిషన్ -2019పై బూత్ కన్వీనర్లు, సేవామిత్రులు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి ఇంకా 9 రోజులే గడువుందని.. అందరూ అవిశ్రాంతంగా పనిచేయాలని తన పార్టీ నేతలకు సూచించారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో.. బూత్ కన్వీనర్ కూడా అంతే ముఖ్యమని.. అందరూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి విస్త‌ృతంగా తీసుకెళ్లాలని అన్నారు. అలాగే.. మన పార్టీపై విమర్శలు చేస్తున్న వారికి సరైన సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఆంధ్రా ప్రజలకు ద్రోహం చేసిన నరేంద్ర మోడీ ఇక్కడకు వచ్చి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఏపీకి చేసిన అన్యాయాన్ని మర్చిపోయి ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నారని మోడీని ప్రశ్నించారు చంద్రబాబు.