ఈసీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
అమరావతి: ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ తీవ్ర స్థాయితో ఫెయిల్ అయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు చేసేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక […]
అమరావతి: ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ తీవ్ర స్థాయితో ఫెయిల్ అయిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేస్తానని చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నాలు చేసేందుకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలేంటో చెప్పాలని ఈసీని డిమాండ్ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారిని ఏ ప్రాతిపదికన నియమించారని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు. ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్ను తానెప్పుడూ చూడలేదని మండిపడ్డారు.
వీవీప్యాట్ల లెక్కింపునకు ఆరు రోజులు పట్టడమేంటని సీఎం ప్రశ్నించారు. గతంలో బ్యాలెట్ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈవీఎం ఓటింగ్ నష్టాలపై సుప్రీంకు వెళ్లినా కూడా…అబద్దాలు చెప్పి బ్యాలెట్ పద్దతుల్లో ఓటింగ్ జరగకుండా చేశారని ఆరోపించారు. 5 కోట్లిస్తే ఒకడు ఈవీఎంలను తారుమారు చేసి ఎమ్మెల్యేలను చేస్తానంటున్నాడని…ప్రజాప్రతినిధుల భవిష్యత్ యంత్రాలపై ఆధారపడి ఉండడమేంటని సీఎం విమర్శించారు. ఏకధాటిగా రెండు గంటలపాటు యంత్రం పని చేయకపోతే రీపోలింగ్కు అవకాశముందని వివరించారు. ఉత్తరాంధ్ర, గోదావరి ప్రజలు సౌమ్యులుగా ఉంటారని…అక్కడ కూడా గొడవలు రెచ్చగొట్టారని సీఎం ఆరోపించారు.