ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట విషాదం…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ అనారోగ్యంతో ఈరోజు(మర్చి 21) తెల్లవారుజూమున కన్నుమూశారు. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రంగస్థలం’, ‘సైరా’, ఖైదీ నెం150, రంగస్థలం, రోబో వంటి సూపర్హిట్ సినిమాలకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన శంకర్-కమల్ కాంబోలో వస్తోన్న ‘ఇండియన్-2’ చిత్రానికి పనిచేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్లో ప్రజంట్ రత్నవేలు టాప్ కెమెరామెన్. ప్రముఖ దర్శకుడు సుకుమార్కు రత్నవేలు అత్యంత సన్నిహితుడు. తల్లి మరణంతో తీవ్ర దు:ఖంలో మునిగిపోయిన రత్నవేలును […]
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ అనారోగ్యంతో ఈరోజు(మర్చి 21) తెల్లవారుజూమున కన్నుమూశారు. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రంగస్థలం’, ‘సైరా’, ఖైదీ నెం150, రంగస్థలం, రోబో వంటి సూపర్హిట్ సినిమాలకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన శంకర్-కమల్ కాంబోలో వస్తోన్న ‘ఇండియన్-2’ చిత్రానికి పనిచేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్లో ప్రజంట్ రత్నవేలు టాప్ కెమెరామెన్. ప్రముఖ దర్శకుడు సుకుమార్కు రత్నవేలు అత్యంత సన్నిహితుడు.
తల్లి మరణంతో తీవ్ర దు:ఖంలో మునిగిపోయిన రత్నవేలును పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఓదార్చుతున్నారు. తన మాతృమూర్తి మరణాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ రత్నవేలు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నా కళ్లను చూసి నా డ్రీమ్ను, ప్యాషన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి అమ్మ. నా ఆనందం, నా శక్తి, నా ప్రేరణ అంతా అమ్మే. ఐ మిస్ యూ అంటూ ట్వీట్ చేశారు రత్నవేలు.
MY Mother One who understood my dream&passion without words by just looking at eyes She stood by me Supported me&made sure,I succeed&achieve wht ever I wish in Life! wht I’m today is because of her! My inspiration My almighty My happiness Amma” I miss you” gratitude4evrLUV pic.twitter.com/K0oBxnHMl2
— Rathnavelu ISC (@RathnaveluDop) March 21, 2020