చైనాపై అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ డేగ కన్ను..!
అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ చైనాపై దృష్టి పెట్టింది. కరోనా తీవ్రతను దాచిపెట్టిందన్న అనుమానంతో వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నంలో ఉంది. కరోనా కారణంగా అమెరికా అల్లకల్లోలం అవుతోంది. రాష్ట్రాలలో వేగంగా విస్తరిస్తోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసింది. అమెరికా ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారింది. దీంతో దీని కథ తేల్చేందుకు సీఐఏ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది అమెరికా. చైనా చెబుతున్నట్టు నిజంగానే అక్కడ కరోనా వెంటనే అదుపులోకి వచ్చిందా లేక వాస్తవాలు దాచిపెట్టారా అన్న కోణంలో […]
అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ చైనాపై దృష్టి పెట్టింది. కరోనా తీవ్రతను దాచిపెట్టిందన్న అనుమానంతో వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నంలో ఉంది. కరోనా కారణంగా అమెరికా అల్లకల్లోలం అవుతోంది. రాష్ట్రాలలో వేగంగా విస్తరిస్తోంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసింది. అమెరికా ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారింది. దీంతో దీని కథ తేల్చేందుకు సీఐఏ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది అమెరికా. చైనా చెబుతున్నట్టు నిజంగానే అక్కడ కరోనా వెంటనే అదుపులోకి వచ్చిందా లేక వాస్తవాలు దాచిపెట్టారా అన్న కోణంలో సీక్రెట్ ఆపరేషన్ మొదలయ్యినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చైనాలో కరోనా బాధితుల విషయంలో నిజాలను బయటకు చెప్పకుండా తక్కువ చేసి చూపించిందన్న అనుమానం అమెరికాకు మొదటి నుంచి ఉంది. అమెరికాలోనే ఇంత తీవ్రంగా ఉంటే చైనాలో ఇంకా ఎక్కువ కేసులు, మరణాలు సంభవించే అవకాశాలు ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తోంది అగ్రరాజ్యం. దీంతో త్వరలోనే వాస్తవాలు బయటపెడతామంటున్నాయి అమెరికా దర్యాప్తు సంస్థలు. అటు ఊహాన్లోనూ పరిస్థితులపై కొన్ని కథనాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. వేలాది మంది మాయమయ్యారని, కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నట్టు ఫోటోలతో కూడిన కథనాలు కొన్ని వెలువడ్డాయి. వీరంతా ఏమై ఉంటారన్నది అమెరికా దర్యాప్తు సంస్థల సందేహం. బాధితుల సంఖ్యను చైనా చాలా తక్కువ చేసి చూపించిందనడానికి ఇదే నిదర్శనమంటున్నాయి అమెరికా పత్రికలు.