చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా
ఏపీ ప్రజాప్రతినిథుల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన పరీక్షల్లో పలువురికి కరోనా నిర్ధారణ అయ్యింది.
YSRCP MP Reddappa: ఏపీ ప్రజాప్రతినిథుల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన పరీక్షల్లో పలువురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా వైరస్ సోకింది. ఆమెకు జ్వరం ఉండటంతో.. రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఉండి చికిత్సను తీసుకోనున్నారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. కరోనా నేపథ్యంలో ఇటు లోక్సభ, అటు రాజ్యసభలో పాల్గొనే సభ్యులందరికీ కరోనా టెస్ట్లు చేసిన విషయం తెలిసిందే.
Read More:
‘అంతర్వేది’ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా