షాకింగ్.. చిరు మూవీ నుంచి మరొకరు ఔట్..!
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యకు షాక్ల మీద షాక్లు పడుతున్నాయి. షూటింగ్లో పాల్గొనేందుకు ఇక కొద్ది రోజులు సమయం ఉందనగా.. ఈ మూవీ నుంచి త్రిష తప్పుకుంది.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’కు షాక్ల మీద షాక్లు పడుతున్నాయి. షూటింగ్లో పాల్గొనేందుకు ఇక కొద్ది రోజులు సమయం ఉందనగా.. ఈ మూవీ నుంచి త్రిష తప్పుకుంది. క్రియేటివ్ ఢిపరెన్స్ల కారణంగానే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. ఇక ఆ స్థానంలో వెంటనే కాజల్ను తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ఇక ఈ మూవీలో నటించేందుకు కాజల్కు భారీగా ముట్టిందనే వార్తలు కూడా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి మరొకరు ఔట్ అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ మూవీకి ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ను తీసుకోగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. మూవీ యూనిట్తో గొడవలేమీ లేకపోయినా.. అనుకున్న సమయానికి ఆచార్య షూటింగ్ జరిగేలా లేకపోవడం.. అలాగే ఆచార్య కన్నా ముందు మరికొన్ని సినిమాలు ఒప్పుకోవడం వల్లే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో చర్చించిన తరువాతే శ్రీకర్ ప్రసాద్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక శ్రీకర్ తప్పుకోవడంతో.. మరో టాలెంటెడ్ ఎడిటర్ నవీన్ నూలిని ఆచార్య కోసం ఎంపిక చేసుకున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. కాగా ఈ చిత్రంలో చెర్రీ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. సోనూసూద్ మరో ముఖ్య పాత్రలో నటించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: ‘మహానటి’ని వద్దంటోన్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే..!