విజయసాయికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్, ఇప్పటివరకూ తలెత్తిన కరోనా ఇబ్బందులకు జగన్ బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్న

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరోనాతో..

విజయసాయికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్, ఇప్పటివరకూ తలెత్తిన కరోనా ఇబ్బందులకు జగన్ బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్న
Follow us

|

Updated on: Jan 27, 2021 | 9:11 PM

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడితే నిమ్మగడ్డదే బాధ్యత అంటున్న అతి మేధావి విజయసాయిరెడ్డికి నాదొక సూటి ప్రశ్న అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 7,150 మంది మరణించారని, 8.87 లక్షల మంది కరోనాతో ఇబ్బందిపడ్డారని, మరి వీటన్నింటికి జగన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా? అని అయ్యన్నపాత్రుడు సూటిగా ప్రశ్నించారు. ‘మీ లెక్కల్లోనే ఇవి ప్రభుత్వ హత్యలు కాబట్టి మరణించిన 7,150 మంది కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థికసాయం చేసి ప్రభుత్వం ఆదుకుంటుందా? ఎన్నికలకు భయపడడంలేదు అన్న నీ స్టేట్ మెంటులోనే భయం కనిపిస్తోంది’ అంటూ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు అయ్యన్న.