భూ సేకరణపై జగన్ కీలక ఆదేశాలు
ఏపీవ్యాప్తంగా పలు నగరాలలో సేకరించాల్సిన భూములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి, కడప, గన్నవరం ప్రాంతాల్లో...
Chief Minister orders land acquisition: ఏపీవ్యాప్తంగా పలు నగరాలలో సేకరించాల్సిన భూములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి, కడప, గన్నవరం ప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్న భూసేకరణలో వేగం పెంచాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. భూసేకరణలో వేగం పెంచాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు.
రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, నిర్మాణాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష జరిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డితోపాటు ఉన్నతాధికారులకు విమానాశ్రాయల ప్రాముఖ్యతను వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, పలు విమానాశ్రయాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (బీఐఏసీఎల్) కార్యకలాపాలను ప్రస్తావిస్తూ.. ఆ విమానాశ్రయం కోసం ఇంకా 98 ఎకరాల మేర భూమి సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. అదే విధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల కోసం కూడా అవసరమైనంత భూమి సేకరించాల్సి ఉందని వివరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వాటర్డ్రోమ్ ప్రాజెక్టుపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు సంబంధించి అవసరమైన భూసేకరణపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. కడప విమానాశ్రయ విస్తరణ కోసం అవసరమైన భూమి సేకరించాలని సీఎం సూచించారు.
ALSO READ: ఏపీ అసెంబ్లీ సెషన్పై చీఫ్ విప్ కీలక వ్యాఖ్యలు
ALSO READ: సీఎంను తిట్టినందుకు ఆరు రోజుల కస్టడీ
ALSO READ: ఈడీ చరిత్రలో భారీ జరిమానా
ALSO READ: అమితాబ్పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు