ఓ కేసులో చిద్దూకు బెయిల్.. కానీ..
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మంగళవారం బెయిల్ లభించింది. కానీ ఈడీ కస్టడీలో కొనసాగుతున్నందున ఆయనకు ఇంకా ఊరట లభించనట్టే ! ఆగస్టు 21 న సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. గత వారంచివరి వరకు ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఆ తరువాత ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించారు. ఈ నెల 24 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరే ఇతర కేసులోనూ చిదంబరం […]
ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మంగళవారం బెయిల్ లభించింది. కానీ ఈడీ కస్టడీలో కొనసాగుతున్నందున ఆయనకు ఇంకా ఊరట లభించనట్టే ! ఆగస్టు 21 న సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. గత వారంచివరి వరకు ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. ఆ తరువాత ఆయనను ఈడీ కస్టడీకి అప్పగించారు. ఈ నెల 24 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరే ఇతర కేసులోనూ చిదంబరం పాత్ర లేదని తేలితే ఆయనను లక్ష రూపాయల పూచీకత్తుతో విడుదల చేయవచ్ఛునని కోర్టు పేర్కొంది. కస్టడీలో ఉన్న ఈ కేంద్ర మాజీ మంత్రికి ఇంటి వంట, ప్రత్యేక సెల్, కంటి అద్దాలు, మందులను అందుబాటులో ఉంచవచ్ఛునని కూడా కోర్టు అనుమతించింది. అయన తన కుటుంబ సభ్యులను రోజూ అరగంట పాటు కలుసుకోవచ్ఛు కూడా అని న్యాయస్థానం తెలిపింది. దాదాపు రెండు నెలలుగా చిదంబరం ఈడీ, కోర్టు కేసులమధ్య నలుగుతున్నారు.అటు-ఆయన తనయుడు కార్తీ చిదంబరం కూడా ఇవే కేసులను ఎదుర్కొంటున్నారు.