మావోల చేతికి పాక్ ఆర్మీ ఆయుధాలు.. అధికారుల ఆందోళన
ఛత్తీస్గఢ్లోని ముర్నార్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు నలుగురు మావోయిస్టులను మట్టుబెట్టారు. అందులో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఆయుధాల్లో పాకిస్తాన్ ఆర్మీ, నాటో ఉపయోగించే హెక్లెర్, కోచ్ జీ3 రైఫిల్లు ఉండటం అధికారులను ఆందోలనకు గురిచేస్తోంది. ఇవి వీరికి ఎలా చేరాయి..? మావోలు, పాకిస్తాన్ ఆర్మీకి ఏం సంబంధం..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును […]
ఛత్తీస్గఢ్లోని ముర్నార్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు నలుగురు మావోయిస్టులను మట్టుబెట్టారు. అందులో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఆయుధాల్లో పాకిస్తాన్ ఆర్మీ, నాటో ఉపయోగించే హెక్లెర్, కోచ్ జీ3 రైఫిల్లు ఉండటం అధికారులను ఆందోలనకు గురిచేస్తోంది. ఇవి వీరికి ఎలా చేరాయి..? మావోలు, పాకిస్తాన్ ఆర్మీకి ఏం సంబంధం..? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
దీనిపై డీఎమ్ అవస్తి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగించే జీ 3 రైఫిల్ను మేము స్వాధీనం చేసుకున్నాం. ఇలా మరో దేశం ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి’’ అని పేర్కొన్నారు. కాగా 2018 సంవత్సరంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మావోల నుంచి జర్మన్లో తయారైన రైఫిల్, అమెరికాలో తయారైన సబ్- మెషిన్ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు విదేశాల్లో తయారైన టెలిస్కోప్లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.