ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దంతేవాడ ప్రాంతంలో రిటర్న్ టూ హోం కార్యక్రమం చేపడుతున్నారు పోలీసులు. స్వచ్చందంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయే..
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దంతేవాడ ప్రాంతంలో రిటర్న్ టూ హోం కార్యక్రమం చేపడుతున్నారు పోలీసులు. స్వచ్చందంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయే వారికి పునరావాసాల ఏర్పాటుతో పాటు.. ఉపాధిని కూడా చూపిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక మంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా దంతేవాడ పోలీసుల ఎదుట ఆదివారం నాడు పన్నెండు మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. గడిచిన రెండు నెలల్లో 71 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 15 మంది తలలపై రివార్డు కూడా ఉంది. మొత్తం ఇప్పటి వరకు 83 మంది మావోయిస్టులు సరెండర్ అయినట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.
‘लोन वराटू’ (अपने घर लौटो) कार्यक्रम के तहत आज 12 नक्सलियों ने दंतेवाड़ा पुलिस को आत्मसमर्पण किया। इनमें से 5 इनामी नक्सली हैं। ‘लोन वराटू’ कार्यक्रम के तहत अब तक 83 नक्सलियों ने आत्मसमर्पण किया है :अभिषेक पल्लव, SP दंतेवाड़ा, छत्तीसगढ़ pic.twitter.com/SHweiYBSHb
— ANI_HindiNews (@AHindinews) August 9, 2020
Chhattisgarh: 12 naxals surrendered before Dantewada Police today under ‘Loan Varatu’ (Return to your home) programme. In the last two months 71 naxals – including 15 with rewards on their heads – surrendered.
— ANI (@ANI) August 9, 2020
Read More :
కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా