పవన్ మూవీలో చెర్రీ.. మెగా ఫ్యాన్స్కు పండగే ఇక..!
పవర్స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే.. అప్పుడు ఫ్యాన్స్ ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే. ఈ క్రేజ్ కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.
పవర్స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే.. అప్పుడు ఫ్యాన్స్ ఆనందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే. ఈ క్రేజ్ కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పవన్ మూవీలో చెర్రీ అతిథి పాత్ర. అవును మీరు చదువుతున్నది నిజమే. దీనిపై ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వకీల్ సాబ్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్న పవన్ కల్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో తదుపరి చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం చెర్రీని తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్తో పవన్కు గుర్తుండిపోయే విజయాన్ని ఇవ్వాలనుకుంటోన్న క్రిష్.. ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు ఓ కీలక పాత్ర కోసం చెర్రీని తీసుకోవాలని అనుకుంటున్నారట. పవన్ పాత్ర గురించి చెప్పే నెరేటర్గా చెర్రీని తీసుకోవాలని ఆయన భావిస్తున్నారట. ఇక ఈ విషయంలో మెగా పవర్స్టార్తో క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నట్లు మూవీ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఇందులో నటించేందుకు చెర్రీ ఒప్పుకుంటే.. ఈ ప్రాజెక్ట్కు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉండటంతో పాటు.. మెగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుంది. కాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలోనూ ఓ కీలక పాత్ర కోసం చెర్రీని అనుకుంటున్నట్లు మెగాస్టార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Read This Story Also: ‘బర్త్డే బాయ్’లకు మెగాస్టార్ స్పెషల్ విషెస్..రేర్ ఫొటోలు షేర్ చేసిన చిరు..!