‘ఫెలుదా’ టెస్ట్: కరోనాను నిర్ధారించేందుకు ఇదే బెస్ట్
కరోనాను నిర్ధారించేందుకు టాటా గ్రూప్-శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్) భాగస్వామ్యంలో రూపుదిద్దుకున్న
Covid 19 Feluda test: కరోనాను నిర్ధారించేందుకు టాటా గ్రూప్-శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్) భాగస్వామ్యంలో రూపుదిద్దుకున్న ఫెలూదా పరీక్ష బెస్ట్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విధానాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల అనుమతిని ఇవ్వగా.. దీని ద్వారా పరీక్ష ఫలితాలు వేగంగా తెలుస్తాయని వారు చెబుతున్నారు. అంతేకాదు కరోనా నిర్ధారణ కోసం ఉన్న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కంటే ఇది వేగమైనది, చౌకైనదని వారు పేర్కొన్నారు.
ఇక ఈ కిట్లు మార్కెట్లోకి వస్తే కరోనా పరీక్షలకు సంబంధించి దేశంలో ముఖ చిత్రం మారిపోనుంది. సాంకేతిక అవరోధాలు కూడా తొలిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ టెస్ట్ను లాలాజలం లేదా రక్తం నమూనాలతో చేస్తారు. పేపర్ స్ట్రిప్పై సీఏఎస్9 అనే ప్రొటీన్ బార్కోడ్ రూపంలో ఉంటుంది. ఇది రక్త/లాలాజల నమూనాతో చర్య పొందడం వలన శరీరంలో ఉన్న కరోనా వైరస్ జాడ తెలుస్తుంది. స్ట్రిప్ రంగు మారితో వైరస్ ఉన్నట్లు లెక్క. ఇక ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కోసం రూ.1600 ఖర్చు అవుతుండగా.. ఫెలూదా ఖర్చు రూ.500 మాత్రమే కావడం విశేషం.
Read More: