పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌.. ఒలింపిక్ విజేత కన్నుమూత

ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత, మేటి అథ్లెట్‌ చార్లెస్‌ మూర్(91) కన్ను మూశారు. గత కొంతకాలంగా పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన గత గురువారం మృతి చెందినట్లు

పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌.. ఒలింపిక్ విజేత కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2020 | 12:10 PM

Charles Moore death: ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత, మేటి అథ్లెట్‌ చార్లెస్‌ మూర్(91) కన్ను మూశారు. గత కొంతకాలంగా పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన గత గురువారం మృతి చెందినట్లు ప్రపంచ అథ్లెటిక్స్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కాగా 1952లో ఫిన్‌లాండ్‌ రాజధాని హెల్సింకి వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో మూర్‌ స్వర్ణ పతకం సాధించారు. అలాగే 1600 మీటర్ల రిలే ఈవెంట్‌లో అమెరికాకు రజత పతకాన్ని సాధించారు. ఇక బ్రిటిష్‌ ఎంపైర్‌ గేమ్స్‌లో 440 మీటర్ల హర్డిల్స్‌లో 51.6 సెకన్లలో గమ్యాన్ని చేరి చార్లెస్‌ ప్రపంచ రికార్డును సృష్టించారు.

ఇక కెరీర్‌కు వీడ్కోలు పలికిన తరువాత వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్‌గా, అథ్లెటిక్స్‌ పాలనాధికారిగా ఆయన పలు బాధ్యతలను నిర్వర్తించారు. ఇక తన కెరీర్‌కు తోడ్పాటు అందించిన మెర్సెర్స్‌బర్గ్‌ అకాడమీకి తాను సాధించిన రెండు ఒలింపిక్‌ పతకాలను మూర్‌ విరాళంగా ఇచ్చారు. హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు‌ ‘13 స్టెప్‌ అప్రోచ్‌’ టెక్నిక్‌ను మూర్‌ సూచించగా.. దీన్ని ఇప్పటి అథ్లెట్స్‌ సైతం హర్డిల్స్‌లో ఉపయోగిస్తుంటారు.

Read More:

భారీ వర్షాలు.. నెహ్రూ జూపార్క్ మూసివేత

సమయం ఆసన్నమైంది.. ప్రతి ఇంట్లో ఒక్క రైతు అయినా పుట్టాలి: పూరీ