వైసీపీలో చేరిన ఆ నటులకు చంద్రబాబు హెచ్చరిక

విజయవాడ: వైసీపీలో చేరిన కొంతమంది నటులను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి వలస పక్షులు వచ్చారని, వారందరినీ కేసీఆర్ బెదిరించి పంపిస్తున్నారని ఆరోపించారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తనను తిడుతున్నారని అన్నారు. ఎవరీ మోహన్‌ బాబు, ఎవరీ జయసుధ, ఎవరీ ఆలీ అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఊడిగం చేస్తానంటే చేయండి, అంతే కానీ ఇక్కడికొచ్చి తమపై పెత్తనం చేయొద్దని హెచ్చరించారు. మేము కష్ట కాలంలో ఉన్నప్పుడు తిత్లీకి వచ్చారా? […]

వైసీపీలో చేరిన ఆ నటులకు చంద్రబాబు హెచ్చరిక
Follow us

|

Updated on: Apr 03, 2019 | 11:12 AM

విజయవాడ: వైసీపీలో చేరిన కొంతమంది నటులను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి వలస పక్షులు వచ్చారని, వారందరినీ కేసీఆర్ బెదిరించి పంపిస్తున్నారని ఆరోపించారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తనను తిడుతున్నారని అన్నారు. ఎవరీ మోహన్‌ బాబు, ఎవరీ జయసుధ, ఎవరీ ఆలీ అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఊడిగం చేస్తానంటే చేయండి, అంతే కానీ ఇక్కడికొచ్చి తమపై పెత్తనం చేయొద్దని హెచ్చరించారు.

మేము కష్ట కాలంలో ఉన్నప్పుడు తిత్లీకి వచ్చారా? హుదూద్‌కు వచ్చారా? కరువుంటే వచ్చారా? ఈ రోజు కష్టపడి నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, హైదరాబాద్ నుంచి వచ్చి మా మీద పెత్తనం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఖబడ్దార్ కేసీఆర్ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమంటూ కేసీఆర్‌పై చంద్రబాబు మండిపడ్డారు.