వాళ్లను ఓడించండి: చంద్రబాబు

విజయవాడ: రాష్ట్ర హక్కుల సాధన కోసం ఢిల్లీలో టీడీపీ నిర్వహించిన ధర్మ పోరాట దీక్షకు మంచి స్పందన వచ్చిందని చంద్రబాబు అన్నారు. మనకు జరిగిన అన్యాయాన్ని ఢిల్లీలో వివరించామని, దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు మద్దతిచ్చాయని చెప్పారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో జగన్‌ను ప్రజలు చిత్తుగా ఓడించాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ ఏమీ ఇవ్వలేదని, కానీ ఇక్కడి రైతులు మాత్రం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని సీఎం […]

వాళ్లను ఓడించండి: చంద్రబాబు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:41 PM

విజయవాడ: రాష్ట్ర హక్కుల సాధన కోసం ఢిల్లీలో టీడీపీ నిర్వహించిన ధర్మ పోరాట దీక్షకు మంచి స్పందన వచ్చిందని చంద్రబాబు అన్నారు. మనకు జరిగిన అన్యాయాన్ని ఢిల్లీలో వివరించామని, దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు మద్దతిచ్చాయని చెప్పారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో జగన్‌ను ప్రజలు చిత్తుగా ఓడించాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ ఏమీ ఇవ్వలేదని, కానీ ఇక్కడి రైతులు మాత్రం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని సీఎం మోడీని విమర్శించారు. రానున్న ఐదేళ్లలో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 40 ఏళ్లుగా తాను సామాజిక న్యాయం పాటిస్తున్నానని, అందరికీ న్యాయం చేస్తుంటే కొందరు మాత్రం కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జగన్ అడ్డుపడుతున్నారని, ఏపీలో నదులను అనుసంధానం చేయడం ద్వారా కరువు లేకుండా చూడటమే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.