నెలరోజుల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత..2024లో అధికారం మనదే..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కార్యకర్తలతో సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీనే ప్రత్యామ్నాయమని..వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకు కౌంట్డౌన్ మొదలైందని..నెలరోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను చైతన్యం చేస్తున్నాయని చెప్పారు. పింఛన్లు, విత్తనాలు, విద్యుత్ను సమయానికి ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. గత ఐదేళ్లూ తాను రాష్ట్రం కోసమే పనిచేశానని.. ఇకపై పార్టీ కోసం పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. […]
కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కార్యకర్తలతో సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీనే ప్రత్యామ్నాయమని..వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకు కౌంట్డౌన్ మొదలైందని..నెలరోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను చైతన్యం చేస్తున్నాయని చెప్పారు.
పింఛన్లు, విత్తనాలు, విద్యుత్ను సమయానికి ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. గత ఐదేళ్లూ తాను రాష్ట్రం కోసమే పనిచేశానని.. ఇకపై పార్టీ కోసం పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలంతా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా వారికి అండగా నిలబడాలని కోరారు.